Venkaiah Naidu: విజయవాడ చేరుకున్న వెంకయ్యనాయుడు... స్వాగతం పలికిన గవర్నర్

  • ప్రత్యేక విమానంలో వచ్చిన ఉపరాష్ట్రపతి
  • ఈ రాత్రికి విజయవాడ స్వర్ణభారతి ట్రస్టులో బస
  • రేపు ఓ విద్యాసంస్థ కార్యక్రమానికి హాజరు
  • ఈ నెల 29న ఢిల్లీ పయనం
Venkaiah Naidu arrives Vijayawada

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వెంకయ్యనాయుడికి గన్నవరం ఎయిర్ పోర్టులో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఉపరాష్ట్రపతికి వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను బహూకరించారు.

కాగా, వెంకయ్యనాయుడు విజయవాడలో మూడ్రోజులు గడపనున్నారు. ఈ రాత్రికి ఆయన నగరంలోని స్వర్ణభారతి ట్రస్టు భవనంలో బస చేస్తారు. రేపు సూరంపల్లిలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్లుండి ఢిల్లీ పయనమవుతారు.

More Telugu News