కాంగ్రెస్ పార్టీతో వున్న కొద్దిపాటి అనుబంధం పట్ల చింతిస్తున్నా: సినీ నటి ఊర్మిళ
- ఇటీవలే శివసేనలో చేరిన ఊర్మిళ
- ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేయడం తనకిష్టంలేదని వెల్లడి
- ప్రజా నాయకురాలిగా ఎదగాలని ఆకాంక్ష
- అందుకే శివసేనలోకి వచ్చానని ఉద్ఘాటన
తాను ప్రజల అభిమానంతోనే సినీ నటిగా ఎదిగానని, ఆ కోవలోనే ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నానని వివరించారు. అందుకే శివసేన పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. కులం, మతం పట్టించుకోనని, ప్రజల కోసమే పనిచేస్తానని ఊర్మిళ చెప్పుకొచ్చారు.
ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తర ముంబయి లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఎడంగా ఉంటున్నారు. శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినా ఊర్మిళ తిరస్కరించారు.