Sabarimala: అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచన

Lord Ayyappa devotees must have rtpcr test report
షార్ట్స్‌లో చూడండి
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కీలక సూచనలు చేసింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని పేర్కొంది. ఈ పరీక్షల్లో తమకు కొవిడ్ సోకలేదని నిర్ధారణ అయితేనే దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

శబరిమల వచ్చే భక్తులు దర్శనానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు చూపించాలని టీడీబీ అధ్యక్షుడు ఎన్ వాసు పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రం లేని వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కాగా, 26న మండలపూజ అనంతరం ఆలయాన్ని మూసివేసి 31న మకరవిళక్కు పూజ కోసం తిరిగి తెరవనున్నారు.
Go Back to Shorts
Sabarimala
Lord Ayyappa
Devotees
RTPCR Test
Corona Virus

More Telugu News