పింక్ బాల్ టెస్టు: ఎంతో పట్టుదలగా ఆడి చివరికి రనౌట్ గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ
- అడిలైడ్ లో భారత్, ఆసీస్ మధ్య డే/నైట్ టెస్టు
- 80 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసిన భారత్
- 74 పరుగులు చేసి అవుటైన కోహ్లీ
- క్రీజులో రహానే, విహారి
- ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగిన పృథ్వీ షా
- రాణించిన పుజారా
అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా (0) తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగాడు. ఈ వికెట్ మిచెల్ స్టార్క్ ఖాతాలోకి వెళ్లింది. అప్పటికి టీమిండియా పరుగుల ఖాతా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (17) ఫర్వాలేదనిపిస్తున్న తరుణంలో కమ్మిన్స్ బంతికి బౌల్డయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన పుజారా (43) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే (42), హనుమ విహారి (4) ఆడుతున్నారు.