రైతులను దేశద్రోహులతో పోల్చుతారా.. క్షమాపణలు చెప్పండి: సుఖ్బీర్ సింగ్ బాదల్
- కేంద్రం విధానాలకు తలొగ్గకుంటే దేశద్రోహులా?
- ఉన్నత పదవుల్లో ఉండీ ఇవేం వ్యాఖ్యలు
- రైతుల గోడు వినిపించుకోకుండా అణచివేయాలని చూస్తున్నారు
ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పిన బాదల్.. వారు వెంటనే రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గోడును వినడానికి ఇష్టపడని ప్రభుత్వం వారిని అణిచివేయాలని చూస్తుండడం దురదృష్టకరమని, కేంద్రం ఇంత దౌర్జన్యంగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని బాదల్ పేర్కొన్నారు.