గులాబీ బంతితో ఆస్ట్రేలియా-ఏ జట్టును కకావికలం చేసిన భారత బౌలర్లు
- సిడ్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులకు ఆలౌట్
- అనంతరం 108 పరుగులకు కుప్పకూలిన ఆస్ట్రేలియా-ఏ
- షమీ, సైనీకి చెరో మూడు వికెట్లు
- రాణించిన బుమ్రా, సిరాజ్
మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ కు కంగారూ బ్యాట్స్ మెన్ వద్ద సమాధానం లేకపోయింది. దాంతో ఆస్ట్రేలియా-ఏ జట్టు 108 పరుగులకు ఆలౌటైంది. షమీ 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, సైనీ 19 పరుగులకు 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు 2, సిరాజ్ కు ఓ వికెట్ లభించాయి. ఆస్ట్రేలియా-ఏ జట్టులో కెప్టెన్ అలెక్స్ కేరీ సాధించిన 32 పరుగులే అత్యధికం.
కాగా, టీమిండియాకు కీలకమైన 86 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టీమిండియా రేపు తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.