డైమండ్ హార్బర్ కు వెళ్లే దారిలో జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్ల వర్షం
- పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న జేపీ నడ్డా
- వాహనం అద్దాలు ధ్వంసం
- అమిత్ షాకు లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్
- నడ్డాకు మమతా సర్కారు సరైన భద్రత కల్పించడంలేదని ఆరోపణ
కాగా, ఆ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. కొందరు వ్యక్తులు పెద్ద ఇటుకల సైజులో ఉన్న రాళ్లను వాహనాలపైకి విసిరారు. ఈ మేరకు ఓ వీడియోలో వెల్లడైంది. ఈ దాడిపై బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ రాగా, ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆ లేఖలో పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. నిన్న జేపీ నడ్డా పాల్గొన్న కార్యాక్రమాల వద్ద పోలీసులే కనిపించలేదని తెలిపారు.