Renigunta: రేణిగుంట పేలుడు వెనుక అసలు కారణాన్ని గుర్తించిన పోలీసులు

Police knows what is the reason behind Renigunta railway track explosion
షార్ట్స్‌లో చూడండి
రేణిగుంట మండలం తారకరామనగర్ లో రైలు పట్టాల పక్కన భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. పట్టాల పక్కనే ఉన్న డబ్బాను కదిలించడంతో విస్ఫోటనం జరిగింది. అయితే ఆ డబ్బా అక్కడికి ఎలా వచ్చిందన్న విషయమై పోలీసులు దర్యాప్తు జరపగా, అసలు విషయం వెల్లడైంది.

ఈ ప్రాంతంలో ఉన్న బాలాజీ వెల్డింగ్ వర్క్స్ లో హీట్ రెసిస్టింగ్ పనులు జరుగుతుండగా, ప్రమాదకర పదార్థాల అవశేషాలతో కూడిన డబ్బాను రైలు పట్టాల వద్ద పారేశారు. నిర్లక్ష్యంగా వదిలేసినందునే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాలాజీ వెల్డింగ్ వర్క్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, డబ్బాను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, దాన్ని అలాగే వదిలేసి వెళ్లారని పోలీసులు తెలిపారు. వెల్డింగ్ వర్క్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Go Back to Shorts
Renigunta
Blast
Railway Track
Police

More Telugu News