ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన నారా లోకేశ్
- ఏలూరులో వింతరోగం
- అంతకంతకు పెరుగుతున్న కేసులు
- పరిస్థితి అదుపు తప్పుతోందన్న లోకేశ్
- రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆరోపణ
- కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలంటూ లేఖ
ఏలూరులో పరిస్థితి దిగజారుతోందని, అక్కడ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కోరుతూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్షన్ కు లేఖ రాశారు. వందల మంది అస్వస్థతకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడంలేదని ఆరోపించారు. ఏలూరు ప్రజలను కాపాడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.