కులభూషణ్ జాదవ్ పై మరో కేసును మోపే కుట్రలో పాకిస్థాన్: మండిపడిన ఇండియా!
- 2008లో సరిహద్దులు దాటిన ఇస్మాయిల్
- గూఢచర్యం ఆరోపణలపై ఐదేళ్ల శిక్ష
- ఇప్పుడు రెండు కేసులనూ పోలుస్తున్న పాక్
ఆపై అక్టోబర్ 2011లో అతనిపై గూఢచర్యం ఆరోపణలను మోపగా, ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్షాకాలాన్ని అతను పూర్తి చేసుకున్నాడు. అయినా అతన్ని ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ కేసుతో కుల్ భూషణ్ కేసును కలపి, ఇస్మాయిల్ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనురాగ్ వెల్లడించారు.
భారత హై కమిషన్ తరఫున ఇప్పటికే ఇస్మాయిల్ సమ్మా విడుదలకై కోర్టును కోరామని, అయితే, ఆ సమయంలో పాకిస్థాన్ అటార్నీ జనరల్ కల్పించుకుని రెండు కేసులనూ కలిపే ప్రయత్నం చేశారని, అసలు ఈ కేసులకు సంబంధమే లేదని తెలియజేశారు. జాదవ్ పై మరో కేసును జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.