సముద్రంలో కూలిపోయిన మిగ్ 29కే... సెర్చ్ ఆపరేషన్ మొదలు!
- ఇద్దరు పైలెట్లతో వెళ్లిన మిగ్
- అరేబియా సముద్రంలో కూలిన విమానం
- రెండో పైలట్ కోసం వెతుకులాట
కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్న సంగతి తెలిసిందే.