Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Corona cases increased in AP
  • 24 గంటల్లో కొత్తగా 1,031 కేసుల నమోదు
  • ఎనిమిది మంది మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 12,615
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా ప్రభావం మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో 67,269 మందికి కోవిడ్ టెస్టులు చేయగా... వారిలో 1,031 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు.

గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 172 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,65,705కి చేరుకుంది. మొత్తం 6,970 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Cases
Updates

More Telugu News