త్వరలో గుమ్మడికాయ కొట్టనున్న ప్రభాస్ 'రాధేశ్యామ్'
- ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ జరుపుకున్న ప్రభాస్ కొత్త చిత్రం
- ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్
- దాదాపు పూర్తికావొచ్చిన రాధేశ్యామ్
ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్, పూజా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, సోషల్ మీడియాలో స్పందన అదిరిపోయింది. ఈ జంట అత్యంత రొమాంటిక్ గా ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. 'సాహో' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ మూవీని గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ కలసి నిర్మిస్తున్నాయి.