Nikhil: రాజా రవీంద్ర చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ హీరో నిఖిల్

Hero Nikhil and heroine Aishwrya Rajesh participated in Green India Challenge
షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా సాగిపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పర్యావరణ హిత కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నారు. తాజాగా యువ హీరో నిఖిల్ కూడా ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. సీనియర్ నటుడు, తన మేనేజర్ రాజా రవీంద్ర విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన నిఖిల్ 3 మొక్కలు నాటారు.

అనంతరం తాను నటిస్తున్న '18 పేజెస్' చిత్రబృందాన్ని నామినేట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ తో పాటు అవికా గోర్, కలర్స్ స్వాతిలను కూడా నామినేట్ చేశారు. వారు 3 మొక్కలు నాటాలని, ఈ గొలుసును కొనసాగించాలని నిఖిల్ సూచించారు. ఈ కార్యాచరణ తీసుకువచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అటు, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కూడా ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. తెలుగు హీరో సుశాంత్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన ఐశ్వర్య 3 మొక్కలు నాటి తన సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. మొక్కలు నాటిన అనంతరం సుశాంత్ ఫ్యాన్స్ అందరినీ నామినేట్ చేశారు.
Go Back to Shorts
Nikhil
Aishwarya Rajesh
Green India Challenge
Plants
Saplings
Tollywood

More Telugu News