Pawan Kalyan: నాకు పారిపోవడం తెలియదు, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటా: పవన్ కల్యాణ్

Pawan Kalyan attends Janasena meetings in Mangalagiri
  • మంగళగిరిలో జనసేన క్రియాశీలక సమావేశాలు
  • దేనిపైనైనా అభిప్రాయం స్పష్టంగా చెబుతానన్న పవన్
  • ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని ఉద్ఘాటన
జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో ప్రారంభమైన పార్టీ క్రియాశీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం తాలూకు అంతిమలక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదని అన్నారు. ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడమే అధికారం అని, జనసేన అదే చేస్తుందని స్పష్టం చేశారు.

సమస్యను ఎత్తిచూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా, సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని విమర్శించారు. తనకు సమస్యల నుండి పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. దేనిపైనైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా చెబుతానని అన్నారు.

పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తుంటారని, అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విభజించి పాలించే విధానంతో ముందుకెళుతున్నారని ఆరోపించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయం అని ఉద్ఘాటించారు.
Pawan Kalyan
Meetings
Janasena
Mangalagiri
Amaravati
AP Capital
Andhra Pradesh

More Telugu News