జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన తెలంగాణ ఇన్చార్జి
- త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు
- హైదరాబాద్ పార్టీ ఆఫీసులో జనసేన శ్రేణుల సమావేశం
- కష్టపడే వారికి ప్రాధాన్యత
జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడే జనసైనికులకు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. యువజన విభాగంతో పాటు విద్యార్థి విభాగం, వీర మహిళ విభాగాల సభ్యులు అందరూ జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు జనసేన నాయకత్వం హైదరాబాదు ప్రశాసన్ నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ నేతలు, విద్యార్థి, యువజన విభాగాలతో సమావేశం నిర్వహించింది.