'దిశ ఎన్ కౌంటర్' సినిమా విషయంలో రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు

High Court issues notice to Ram Gopal Varma
  • దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని ఆపాలంటూ దిశ తండ్రి పిటిషన్
  • విచారణ చేపట్టిన హైకోర్టు
  • కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు, ప్రభుత్వానికి ఆదేశాలు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. ఆయన ఏ చిత్రం ప్రారంభించినా ఏదో ఒక రూపంలో వివాదాన్ని వెంట తెచ్చుకుంటారు. తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'దిశ ఎన్ కౌంటర్' చిత్రం కూడా ఈ కోవలోకే చేరింది. ఆ చిత్రాన్ని ఆపాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు నిర్ణయం రాకముందే మీరు కోర్టుకు ఎందుకు వచ్చారని దిశ తండ్రిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో దిశ తండ్రి తరఫున ఆయన న్యాయవాది స్పందించారు. సినిమా సెన్సార్ పరిధిలోనే ఉన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సినిమా ట్రైలర్ లు విడుదల చేస్తున్నారని కోర్టుకు వివరించారు. దాంతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మను ఆదేశించింది.

ఈ సినిమాకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకుని తమకు సమాచారం అందించాలంటూ సొలిసిటర్ జనరల్ ను కూడా ఆదేశించిన న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
Go Back to Shorts
Ram Gopal Varma
Notice
TS High Court
Disha Encounter

More Telugu News