Tamannaah: ఒకరి గురించి కామెంట్ చేసేముందు అసలా వ్యక్తికి ఏమైంది అని ఆలోచించరా?: తమన్నా

  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న తమన్నా
  • చికిత్సలో వాడిన మందులతో బరువు పెరిగినట్టు వివరణ
  • ఫొటో షేర్ చేస్తే లావుగా ఉన్నావు అన్నారని వెల్లడి
  • లోపాలే చూస్తారా..? అంటూ ఆవేదన
Tamannaah opines on her recent corona experience

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అయితే తాను కరోనా బారినపడి కోలుకున్న తర్వాత కొంచెం బరువు పెరిగానని, దానిపైనా కొందరు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తమన్నా పేర్కొన్నారు.

 కరోనా చికిత్సకు వాడిన మందులతో లావయ్యానని, ఆ సమయంలో తాను ఓ ఫొటో చేర్ చేస్తే అది చూసి లావుగా ఉన్నావు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల గురించి వ్యాఖ్యలు చేసే ముందు వారికి ఏమైంది అని ఏమాత్రం ఆలోచించరా? అని తమన్నా ప్రశ్నించారు. ఒకరి పట్ల కామెంట్ చేసేటప్పుడు కేవలం వారిలోని లోపాలు మాత్రమే చూస్తారన్న సంగతి అర్థమైందని పేర్కొన్నారు.

ఇక, కరోనా సోకిన సమయంలో తన మానసిక స్థితి ఎలావుందో తమన్నా వివరించారు. కరోనా పాజిటివ్ అని తెలియగానే భయపడ్డానని, చికిత్స పొందుతున్న సమయంలో చచ్చిపోతానన్న ఆలోచనలతో ఆందోళనకు గురయ్యానని వెల్లడించారు. అయితే డాక్టర్ల చలవతో బతికి బయటపడ్డానని, ఈ కష్ట సమయంలో తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వల్ల జీవితం ఎంత విలువైనదో అర్థమైందని తమన్నా వివరించారు.

More Telugu News