brucellosis: చైనాలో వెలుగుచూసిన కొత్త బ్యాక్టీరియా.. 6 వేల మందికి సోకిన ‘బ్రూసెల్లోసిస్’

  • 55,725 మందికి పరీక్షలు చేస్తే 6,620 మందికి పాజిటివ్
  • వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ నుంచి లీకేజీనే కారణం
  • బాధితుల్లో ఫ్లూ వంటి లక్షణాలు
More than 6000 people test positive for brucellosis in China

కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించిన చైనాలో మరో కొత్త రకం బ్యాక్టీరియా వెలుగుచూసింది. దీనిని బ్రూసెల్లోసిస్ అని తేల్చారు. గన్సు ప్రావిన్స్‌ రాజధాని లాన్‌ఝౌలో ఆరువేల మందికిపైగా ఈ బ్యాక్టీరియా బారినపడినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది క్రితం చైనా పశుసంవర్థకశాఖకు చెందిన బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి  లీకేజీ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్టు పేర్కొంది.

నగరంలో మొత్తం 55,725 మందిని పరీక్షించగా, వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వివరించింది. బ్యాక్టీరియా సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతుందని లాన్‌ఝౌ హెల్త్ కమిషన్ పేర్కొంది. కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో 3,245 మంది ఈ బ్యాక్టీరియా బారినపడ్డారు. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

More Telugu News