Kandula Sivananda Reddy: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత!

  • తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
  • టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కందుల
  • పలు విద్యా సంస్థలను నిర్వహించిన శివానందరెడ్డి
YSR opponent Kandula Sivananda Reddy dead

మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కందుల 1989లో కాంగ్రెస్ తరపున కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

వ్యాపారవేత్తగా ఏపీలో కందుల శివానందరెడ్డికి గుర్తింపు ఉంది. కందుల గ్రూప్స్ పేరుతో ఆయనకు పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ప్రత్యర్థిగా కందులకు గుర్తింపు ఉంది. కాలక్రమంలో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు.

More Telugu News