చైనా తయారీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ రాజు
- ‘సినోఫార్మ్’ను అభివృద్ధి చేసిన చైనా ప్రభుత్వ కంపెనీ
- మూడో దశ ప్రయోగాల్లో ఉండగానే అత్యవసర వినియోగానికి యూఏఈ అనుమతి
- రాజుతోపాటు విదేశాంగ మంత్రి, ఉప ప్రధానికి కూడా వ్యాక్సినేషన్
నిజానికి ఈ టీకా ప్రస్తుతం మూడో దశ పరీక్షల్లో ఉన్నప్పటికీ అత్యవసర ప్రాతిపదికన దుబాయ్ దీనిని వినియోగిస్తోంది. రాజుతోపాటు దుబాయ్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని కూడా టీకాను వేయించుకున్నారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరికీ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం యూఏఈలో ఇప్పటి వరకు 1,35,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 497 మంది మృత్యువాత పడ్డారు.