Chandrababu: ముసావీ కుటుంబంలో 20రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరం: చంద్రబాబు

  • విజయవాడ లాయర్ ముస్తావీ ఇంట్లో విషాదం
  • 20 రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి
  • ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు
Chandrababu pays tributes to Musavis family

విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబమంతా కరోనా బారిన పడి మృతి చెందిన ఘటన అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఆవేదనను వ్యక్తం చేశారు. కుటుంబంలో 20 రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగించిందని అన్నారు.

 కరోనా ఏ విధంగా జన జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణమని చెప్పారు. సుల్తాన్ ముసావీ కుమార్తెకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఇంతటి విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆమెకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

More Telugu News