చేసిన సవాలు మేరకు ఆ మంత్రి ఇప్పుడు మీసాలు తీస్తారా?: నారా లోకేశ్
- టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి
- ఈ విషయాన్ని జగన్కు అధికారులు చెప్పారు
- 70 శాతం పూర్తని తేలితే మీసాలు తీస్తానని ఓ మంత్రి అన్నారు
దీంతో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. 70 శాతం పనులు పూర్తయితే తాను మీసాలు తీసేస్తానని, లేదంటే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీసాలు తీయాలని ఓ మంత్రి ఇటీవల సవాల్ విసిరారని లోకేశ్ గుర్తు చేశారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని ఇప్పుడు ఆ పార్టీ నేతలకు స్పష్టమైందని, మరి సవాలు చేసిన ఆ మంత్రి మీసాలు తీస్తారా? అని లోకేశ్ నిలదీశారు.