రాజ్యసభ ఎన్నికల వేళ.. బీఎస్పీ చీఫ్ మాయవతికి ఆరుగురు ఎమ్మెల్యేల షాక్
- వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు
- రిటర్నింగ్ అధికారిని కలిసిన ఆరుగురు ఎమ్మెల్యేలు
- తమ సంతకాలను ఫోర్జరీ చేశారని నలుగురి ఫిర్యాదు
నిన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రిటర్నింగ్ అధికారిని కలిసి.. రామ్జీ గౌతమ్ నామినేషన్ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దొరకకపోవడంతో వీరంతా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తాను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను కలిసినట్టు రెబల్స్లో ఒకరైన మహిళా ఎమ్మెల్యే తెలిపారు.