గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేతపై నవంబర్ 30వరకు స్టే
- నిన్న తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టిన అధికారులు.
- నోటీసులు కూడా ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన గీతం యాజమాన్యం
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కొన్ని కట్టడాలను నిన్న జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజాము నుంచే పొక్లెయిన్ లతో కూల్చివేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఆర్డీవో పెంచలయ్య ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 30 వరకు వాయిదా వేసింది.