Kishan Reddy: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Union minister kishan reddy visits Goddess vijayawada kanaka durga
  • బీజేపీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభానికి విజయవాడకు
  • ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకుని పూజలు
  • ప్రసాదం పథకం కింద రూ. 85 కోట్లు మంజూరు చేయాలని ఈవో వినతి
విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి పోయి ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించిన ఆలయ ఈవో సురేశ్ బాబు ప్రసాదం పథకం కింద రూ. 85 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మంత్రి వెంట ఎంపీ జీవీఎల్, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Kishan Reddy
Vijayawada
BJP
Andhra Pradesh

More Telugu News