ఐపీఎల్ లో నేడు ముంబయి వర్సెస్ చెన్నై... రోహిత్ శర్మ స్థానంలో టాస్ కు వచ్చిన పొలార్డ్
- గాయంతో ఈ మ్యాచ్ కు దూరమైన రోహిత్ శర్మ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- రోహిత్ స్థానంలో సౌరభ్ తివారీకి ముంబయి జట్టులో చోటు
- జాదవ్, వాట్సన్, చావ్లాలను పక్కనబెట్టిన చెన్నై
ఇక జట్ల విషయానికొస్తే... చెన్నై జట్టులో మూడు మార్పులు చేశారు. కేదార్ జాదవ్, షేన్ వాట్సన్, పియూష్ చావ్లా స్థానంలో జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్, ఇమ్రాన్ తాహిర్ జట్టులోకి వచ్చారు. ముంబయి జట్టులో రోహిత్ శర్మ స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సౌరభ్ తివారీని తీసుకున్నారు.