నవంబర్ 9న జైలు నుంచి లాలూ వస్తారు.. మర్నాడే నితీశ్ కు వీడ్కోలు: తేజశ్వి యాదవ్
- ఎన్నికల ప్రచారంలో తేజశ్వి సంచలన వ్యాఖ్యలు
- తమదే గెలుపని భరోసా వ్యక్తం చేసిన తేజశ్వి
- ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
అవినీతి కేసులో లాలూ ఝార్ఖండ్ లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా ఆయన బయటకు రాలేకపోయారు. మరో కేసులో బెయిల్ రావాల్సి ఉండటం వల్ల ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు, ఇదే సమయంలో ప్రధాని మోదీపై తేజశ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బీహార్ కు మోదీ వస్తున్నారని... రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎప్పుడిస్తారో ఆయన చెపితే వినాలనుకుంటున్నానని అన్నారు.