డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పై సైబర్ దాడి... స్తంభించిన కార్యకలాపాలు
- ఐదు దేశాల్లో కార్యకలాపాల నిలిపివేత
- నష్టనివారణ కోసం డేటా సెంటర్ సేవలను వేరు చేసిన రెడ్డీస్
- సైబర్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు
సైబర్ దాడి నేపథ్యంలో ఇతర విభాగాలు దీని ప్రభావానికి గురికాకుండా తమ డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఈ సైబర్ దాడిపై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిన విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వర్గాలు స్టాక్ ఎక్చేంజ్ కు సమాచారం అందించాయి.