చంద్రబాబు ఇంటిని ముంచాలని కుతంత్రాలు చేస్తున్నారు: అయ్యన్నపాత్రుడు
- ఎంత వరద వస్తుందో అంచనా వేసి గేట్లు ఎత్తాలన్న అయ్యన్న
- విమర్శిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపణ
- విజయసాయి 6 వేల ఎకరాలు కబ్జా చేశారంటూ వ్యాఖ్యలు
దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించడంలేదని తెలిపారు. విశాఖలో ప్రేమ సమాజం భూములు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని అయ్యన్న వ్యాఖ్యానించారు. విశాఖలో 6 వేల ఎకరాలకు పైగా విజయసాయిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రిపై చర్యలు తీసుకోలేదని, మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సీఎం జవాబు చెప్పాలని నిలదీశారు.