ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు: చిరంజీవి

Chiranjeevi congratulates Nagababu
  • కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేసిన నాగబాబు
  • మరికొందరిని కాపాడడానికి ప్లాస్మా దానం చేశాడని చిరంజీవి కితాబు
  • అందరూ ప్లాస్మా దానం చేయాలని పిలుపు
సినీ నటుడు నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా బాధితులను కాపాడాలనే మంచి లక్ష్యంతో ఆయన ప్లాస్మాను దానం చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. నాగబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'కరోనాపై పోరాడి గెలవడమే కాకుండా... మరికొందరిని కాపాడే క్రమంలో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
nagababu
Plasma Donation

More Telugu News