Avanthi Srinivas: గతంలో జరిగిన ఆ తప్పు మళ్లీ జరగకుండా మేం చూస్తున్నాం: మంత్రి అవంతి

Jagan will never do any harm to Amaravathi says Avanthi Srinivas
  • గతంలో అభివృద్ది మొత్తం హైదరాబాదులోనే జరిగింది
  • రాష్ట్రం విడిపోవడానికి ఇదొక ప్రధాన కారణం
  • మేము మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
గతంలో అభివృద్ది మొత్తం హైదరాబాదుకు మాత్రమే పరిమితమైందని... రాష్ట్రం విడిపోవడానికి అదే ప్రధాన కారణమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గతంలో జరిగిన ఈ తప్పు మళ్లీ జరగకుండా తాము చూస్తున్నామని చెప్పారు.

అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలును  కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతికి నష్టం కలిగించే ఏ ఒక్క పని ముఖ్యమంత్రి జగన్ చేయరని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అమరావతి అభివృద్ధినే కోరుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రయత్నాలకు కొందరు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
Avanthi Srinivas
Jagan
YSRCP
Amaravati
Chandrababu

More Telugu News