Venkaiah Naidu: కరోనా నుంచి కోలుకున్న వెంకయ్యనాయుడు... తాజా పరీక్షలో నెగెటివ్

  • కొన్నిరోజుల కిందట కరోనా బారినపడ్డ వెంకయ్య
  • హోం క్వారంటైన్ లో ఉన్న వెంకయ్య
  • సోమవారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన ఎయిమ్స్  బృందం
Vice President Venkaiah Naidu tetsed corona negative

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. వెంకయ్యనాయుడుకు ఎయిమ్స్ వైద్యబృందం సోమవారం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. వెంకయ్యకు కరోనా నయమైందని వెల్లడి కావడంతో అందరిలోనూ నిశ్చింత ఏర్పడింది.

వెంకయ్యనాయుడుకు కరోనా అంటూ సెప్టెంబరు 29న ఓ ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వెంకయ్యనాయుడు హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందన్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. త్వరలోనే వెంకయ్యనాయుడు అధికారిక విధులకు హాజరవుతారని, డాక్టర్ల సూచనల మేరకు వ్యవహరిస్తారని ఓ ప్రకటన చేసింది.

More Telugu News