Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా

  • హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ
  • హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో వచ్చేనెల 9న విచారణ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణపై నిర్ణయం తీసుకోనున్న కోర్టు
court adjourns jagan case trial

హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా, గత శుక్రవారం ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది.

అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు చేపట్టనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఏపీ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టును కోరారు. అయితే, దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

More Telugu News