ఉద్రిక్తతల వేళ సైతం భారత వైద్యుడికి చైనా నివాళి!
- చైనా, జపాన్ యుద్ధ సమయంలో సైనికులకు సాయం అందించిన డాక్టర్ కోట్నిస్
- అక్కడే స్థిరపడి 1942లో కన్నుమూత
- ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున నివాళి
కోట్నిస్ సేవలను గుర్తించిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున సంస్మరణ సభ నిర్వహిస్తోంది. శనివారం ఆయన 110వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించింది. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు డాక్టర్ కోట్నిస్పై రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. భారత్, చైనా దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సైతం భారతీయ వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.