టీఆర్ఎస్ నేతను తుపాకితో కాల్చి చంపిన మావోలు!
- ములుగు జిల్లాలో దారుణం
- భీమేశ్వరరావు ఇంట్లోకి చొరబడిన ఆరుగురు మావోలు
- ఉనికి కోసమే హత్య చేశారన్న పోలీసులు
ఆపై అదే ప్రాంతంలో కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెళ్లిపోయే వేళ, మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోల ఏరివేత దిశగా కూంబింగ్ ను పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోలు ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.