ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్లా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- 9 నెలలుగా మోసాలకు పాల్పడుతున్న ముఠా
- ఉద్యోగాల పేరుతో 12 మంది నుంచి రూ. 28 లక్షల వసూలు
- రెండు బైక్లు, రెండు తులాల బంగారం స్వాధీనం
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. జడ్చర్లకు చెందిన ఓ బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ. 6.5 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆయన ఆరోపించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న మహబూబ్నగర్ శివారులోని అప్పన్నపల్లి బ్రిడ్జి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇప్పటి వరకు ఇలా 12 మంది నుంచి రూ. 28 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్లు, రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.