Jagan: వైఎస్ జగన్ కేసుల విచారణ వాయిదా

  • హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ
  • ఈ నెల 12కి వాయిదా
  • హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులు నవంబరు 9కి వాయిదా
  • విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలన్న న్యాయవాదులు
jagan cases adjourn

హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. ఈ రోజు ఈ కేసును మరోసారి పరిశీలించిన న్యాయస్థానం ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులను నవంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా, ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఈడీ, సీబీఐ అధికారులు నమోదు చేసిన మరికొన్ని కేసులు ఈ రోజు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

More Telugu News