Chinna Jeeyar Swamy: ఆశ్రమంలోకి వచ్చిన తాబేలు పిల్లకు ఆహారం తినిపించిన చినజీయర్ స్వామి

  • ఇటీవల శ్రీకూర్మం క్షేత్రాన్ని సందర్శించిన స్వామి
  • కొన్నిరోజులకే ఆశ్రమంలో తాబేలు పిల్ల ప్రత్యక్షం
  • తాబేలు పిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న స్వామి
Chinna Jeeyar Swamy feeds a tortoise in his Ashram

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, హైందవ ప్రచారకర్త చినజీయర్ స్వామి ఇటీవలే శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం క్షేత్రాన్ని దర్శించుకుని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని తమ ఆశ్రమానికి వచ్చారు. అయితే ఆయన ఆశ్రమానికి తిరిగొచ్చిన కొన్నిరోజులకే ఓ తాబేలు పిల్ల ఆశ్రమంలోకి వచ్చింది.

ఈ విషయం తెలిసిన చినజీయర్ స్వామి విస్మయానికి గురయ్యారు. అంతేకాదు, ఆ తాబేలును ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ, స్వయంగా ఆయనే దానికి ఆహారం తినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆశ్రమ వర్గాలు విడుదల చేశాయి.

More Telugu News