Viral Pics: ముళ్ల కంచె డ్రస్ తో మోదీ ప్రభుత్వంపై యువతి నిరసన అంటూ ప్రచారం... ఫేక్ ఫొటో అని తేలిన వైనం!

  • సామాజిక మాధ్యమాల్లో ఫోటో వైరల్
  • శ్రీలంక సంప్రదాయ వస్త్రాలంకరణగా గుర్తింపు
  • కొలంబియాకు చెందిన టూరిస్టని వెల్లడి
Fake Photo on Hatras Protest

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్న వేళ, సామాజిక మాధ్యమాల్లో ఓ చిత్రం వైరల్ అయింది. ఒళ్లంతా ముళ్ల తీగలు చుట్టుకున్న మహిళ తీవ్ర నిరసన తెలియజేస్తుండగా, మోదీ ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బని వ్యాఖ్యానిస్తూ, పలువురు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. దీంతో కొన్ని ఫ్యాక్ట్ చెక్ ఏజన్సీలు అసలు విషయాన్ని తెలిపాయి.

ఈ ఫొటోను హత్రాస్ నిరసనలకు సంబంధించినది కాదు. అసలు నిరసనే కాదు. శ్రీలంకలో ఓ రకం సంప్రదాయ వస్త్రాలంకరణ. దీని పేరు 'ఓసారియా'. 2015లో కొలంబియాకు చెందిన జనని కురేయ్ అనే మహిళ పర్యాటకురాలిగా శ్రీలంకకు వెళ్లి, అక్కడ ఇలాంటి వస్త్రధారణ ధరించింది. ఈ తరహా చిత్రాలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. అదీ సంగతి!

More Telugu News