హత్రాస్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం: యూపీ ప్రభుత్వం ప్రకటన
- నలుగురు మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురై అసువులు బాసిన బాధితురాలు
- దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు
- నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న యూపీ సీఎం
కాగా, హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు అనంతరం ఆమెను దారుణంగా హింసించారు. ఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను తెగ్గోశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న కన్నుమూసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.