వాజ్ పేయి లేరు... ఆయన ఎన్డీయే లేదు: హర్ సిమ్రత్ కౌర్ కీలక వ్యాఖ్యలు
- ఎన్డీయేను దూరదృష్టితో వాజ్ పేయి ప్రారంభించారు
- ఇప్పుడు ఆ ఎన్డీయే లేనే లేదు
- ట్విట్టర్ లో హర్ సిమ్రత్ కౌర్
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన వారం రోజుల తరువాత హర్ సిమ్రత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యవసాయ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకుని వచ్చినప్పటి నుంచి తమ వ్యతిరేకతను చెబుతూనే ఉన్న శిరోమణి అకాలీదళ్, ఈ బిల్లులను ఆమోదించిన తరువాత, తమ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై దేశవ్యాప్తంగా రైతు నిరసనలకు విపక్ష పార్టీలతో కలిసి ఎస్ఏడీ సైతం చేతులు కలిపింది. తాజాగా ఎన్డీయే నుంచి శాశ్వతంగా బయటకు వస్తున్నట్టు ప్రకటించింది.