నాన్న గారికి మరికొన్ని రోజుల్లో ఎక్మో, వెంటిలేటర్ తొలగిస్తారనుకుంటున్నా: ఎస్పీ చరణ్

SP Charan tells health details of his ailing father SP Balasubrahmanyam
  • ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్న చరణ్
  • ఇప్పటికీ ఎక్మో, వెంటిలేటర్ పైనే చికిత్స జరుగుతోందని వెల్లడి
  • ఫిజియోథెరపీ కొనసాగుతోందంటూ ట్వీట్
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఎస్పీ బాలు ఆగస్టు మొదటి వారం నుంచి కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఓ దశలో పరిస్థితి విషమంగా  మారడంతో ఎస్పీ బాలును ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఆపై ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు. దీనిపై ఎస్పీ చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.

త్వరలోనే తన తండ్రికి ఎక్మో, వెంటిలేటర్ తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్, ఎక్మో వ్యవస్థల సాయంతోనే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఫిజియోథెరపీ కొనసాగుతోందని ట్విట్టర్ లో వివరించారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా, తన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
SP Balasubrahmanyam
SP Charan
Health Update
Corona Virus
MGM Hospital
Chennai

More Telugu News