Devineni Uma: పబ్జీ గేమ్ ఆగిపోవడంతో సీఎం జగన్ కు ఏం చేయాలో తెలియడం లేదు: దేవినేని ఉమ
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పబ్జీ గేమ్ ఆగిపోవడంతో సీఎం జగన్ కు ఏంచేయాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. దాంతో ఆ ఆటను ప్రజలపై ఆడుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. అమరావతి అంగుళం కూడా కదలదని దేవినేని ఉమ స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్మించిన అసెంబ్లీ, సచివాలయంలో కూర్చుని ప్రభుత్వం రైతుల గుండెలపై తన్నుతోందని మండిపడ్డారు.