China: ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ చైనా ప‌త్రిక‌ క‌థ‌నం

  • యుద్ధం కోరుకోవడం లేదు
  • మా దేశం చాలా మంచిది
  • భారత ఆర్మీయే హద్దులు మీరుతోంది
  • ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా సిద్ధం
china on lac tensions

భార‌త్-చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్ పై చైనా ప్ర‌భుత్వ‌ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్  భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. భారత్‌తో చైనా ఏ మాత్రం యుద్ధం కోరుకోవడం లేదని పేర్కొంది. త‌మ దేశం చాలా మంచిద‌ని, దాన్ని అలుసుగా తీసుకుని కాల్పులు జ‌రిపితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.

సరిహద్దుల్లో భారత ఆర్మీయే హద్దులు మీరుతోందంటూ వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మ‌ధ్య‌ చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించునేందుకు త‌మ దేశం ప్రయత్నిస్తోందని పేర్కొంది. త‌మ దేశ సైన్యం ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉందని తెలిపింది.

భార‌త్ పై తన చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకునేలా చైనా ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. కాగా, సరిహద్దుల్లో భారత బలగాలే వాస్తవాధీన రేఖ దాటాయంటూ చైనా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోన్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, స‌రిహ‌ద్దుల వద్ద గ‌త అర్ధ‌రాత్రి భార‌త ఆర్మీయే కాల్పులు జ‌రిపింద‌ని చైనా ఆరోప‌ణ‌లు చేసింది.

More Telugu News