ఎఫ్ఎంజీఈ పరీక్ష కేంద్రంలో సాయిపల్లవి సందడి
- జార్జియాలో మెడిసిన్ చదివిన సాయిపల్లవి
- తాజాగా మెడికల్ బోర్డు పరీక్షకు హాజరు
- సాయిపల్లవితో ఫొటోలకు ఎగబడిన వైనం
ఈ పరీక్ష రాసేందుకు సాయిపల్లవి తిరుచ్చి వచ్చింది. తిరుచ్చిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో ప్రత్యక్షమైన సాయిపల్లవిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెతో సెల్ఫీలకు, ఫొటోలకు ఎగబడడంతో పరీక్ష కేంద్రంలో సినీ సందడి నెలకొంది. పాపం సాయిపల్లవి... తాను మాస్కు ధరించి వచ్చినా అందరూ గుర్తుపట్టడంతో చేసేది లేక చిరునవ్వుతో ఫొటోలకు పోజులిచ్చి అందరినీ సంతోషపెట్టింది.
