Jagan: నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు: జగన్

jagan on ysr varthanti
షార్ట్స్‌లో చూడండి
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. 'నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు' అని జగన్ ట్వీట్ చేశారు.

కాగా, వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయనకు జగన్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో వారంతా కలిసి పాల్గొన్నారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. 
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News