Balakrishna: కరోనా మహమ్మారిని మంత్రంతో తరిమికొడదామన్న బాలయ్య... వీడియో ఇదిగో!

  • హిందూపురంలో బాలయ్య పర్యటన
  • హిందూపురం ఆసుపత్రికి ఉపకరణాల అందజేత
  • కరోనా మంత్రాన్ని పలికిన బాలయ్య
Balakrishna explains a mantra to tackle corona pandemic

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి రూ.55 లక్షల విలువైన వైద్య ఉపకరణాలు అందించారు. ఇంకా అనేక కార్యక్రమాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారిని పారదోలేందుకు, దీని పట్ల ప్రజల్లో ఉన్న భయం తొలగించేందుకు ఓ మంత్రం జపించాలని పిలుపునిచ్చారు. ఈ లలిత మహా త్రిపుర సుందరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలని చెబుతూ, ఆ మంత్రాన్ని ఓసారి పలికారు. ఈ మంత్రం పఠించడం వల్ల కరోనా దరిచేరదని అన్నారు. ఒకవేళ తాను చెప్పిన మంత్రం మరీ పెద్దదిగా అనిపిస్తే దానికి షార్ట్ కట్ ను కూడా బాలయ్య సూచించారు. కరోనాను ఎదుర్కొనడానికి అన్ని అస్త్రాలు ఉపయోగించాలని స్పష్టం చేశారు.

More Telugu News