దర్శకుడు శంకర్ కు భూమి కేటాయింపు... టీఎస్ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
- రూ. 2.5 కోట్ల భూమిని రూ. 25 లక్షలకే ఎలా కేటాయిస్తారు?
- ప్రభుత్వమే స్టూడియోను నిర్మించవచ్చు కదా?
- కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలి
ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే హైదరాబాదులో అద్భుతమైన రామోజీ ఫిలింసిటీ ఉందని గుర్తు చేసింది. కావాలనుకుంటే ప్రభుత్వమే స్టూడియోను నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. ఇలాంటి భూకేటాయింపుల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు సహేతుకత ఉండాలని చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.