ఐక్యరాజ్యసమితిలో చైనాకు చేదు అనుభవం!
- ఉయ్ ఘర్లు, ఇతర మైనార్టీలను చైనా నిర్బంధిస్తోందన్న యూఎస్, బ్రిటన్, జర్మనీ
- 10 లక్షల మందికి పైగా ప్రజలను నిర్బంధించిందని వాదన
- భద్రతామండలిలో ఏకాకిగా మిగిలిపోయిన చైనా
దాదాపు 10 లక్షల మందికి పైగా ఉయ్ ఘర్లను, ఇతర మైనార్టీలను చైనా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ అన్నారు. ఆయన వాదనతో బ్రిటన్, జర్మనీలు ఏకీభవించాయి. ఈ నేపథ్యంలో భత్రతామండలిలో చైనా ఏకాకిగా మిగిలిపోయింది.